మౌనం వీడ‌ని బాలకృష్ణ.. అక్కినేని ఫ్యాన్స్ కొత్త డిమాండ్‌!

ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్ప‌దమైన సంగతి తెలిసిందే. బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులే కాకుండా పలువురు ప్రియులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది.

`ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, అలాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే` అంటూ అక్కినేని న‌ట‌వార‌సుడు నాగచైతన్య, అఖిల్ హుందాగా బాల‌య్య‌కు చుర‌క‌లు వేశారు. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు.

అయితే రెండు రోజులుగా వివాదం నడుస్తునా బాలయ్య మాత్రం నోరు విప్ప‌డం లేదు. నా ఉద్దేశం అది కాదని క‌నీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక బాల‌య్య మౌనం వీడ‌క‌పోవ‌డంతో అక్కినేని ఫ్యాన్స్ కొత్త డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే సినిమా ఇండస్ట్రీ నుండి ఆయ‌న్ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలు అంటే గౌరవం లేని బాలయ్య కు ఇండస్ట్రీ లో కొనసాగే అర్హత లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా బాల‌య్య ఈ విష‌యంపై స్పందిస్తారా.. లేదా.. అన్న‌ది చూడాలి.