సినిమా విడుదల కాకముందే బాలయ్య చిత్రానికి పెద్ద దెబ్బగా..!!

ఈసారి సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద హౌరాహోరీగా పోటీ ఉండనుంది. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతూ ఉండగా వేలాది మంది అభిమానులు రాకతో జనం కూడా ఎక్కువగా వస్తారని ఊహించిన పోలీసు అధికారులు అనుమతి ఇవ్వడం కష్టతరంగా మారుతోందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈనెల 6వ తేదీన ఒంగోలులో MBM గ్రౌండ్లో జరగవలసిన నందమూరి వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే అందుకు కారణం ఇటీవల జరిగిన కొన్ని దుర్ఘటనలు కారణమని తెలియజేస్తున్నారు.

All set for Veera Simha Reddy pre-release event | cinejosh.com
మొన్నటికి మొన్న ఒక భారీ కార్యక్రమంలో తొక్కిసలాటతో అమాయకులు మరణించారని ఒంగోలులో కూడా భారీ సభలతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అనుమతులు మంజూరు చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతోంది. తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదుకి మారుస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒంగోలు నేపథ్యంలో కథాంశం కాబట్టి వీరసింహారెడ్డి ఈవెంట్ ని కూడా ఒంగోలులో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.

కానీ ఈ వేడుకకు ఆటంకం తప్పడం లేదని భారీ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు చిత్ర బృందం ఇప్పుడు మరొక వేదిక కోసం చూస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి రిలీజ్ వేడుకతో పాటు చిరంజీవి నటిస్తున్న వాల్తేర్ వీరయ్య రిలీజ్ కూడా భారీగా జనాలు వచ్చే అవకాశం ఉంది దీంతో ఏపీ పోలీసులు ముందస్తు జాగ్రత్త తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిత్ర బృందం ఏ సినిమాల పైన ఎలా స్పందిస్తుందో చూడాలి.