డ్రగ్స్ కేసులో కేవలం రకుల్ ఎందుకు టార్గెట్ అయ్యింది..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ గ్లామర్, అందం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కేవలం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ వైపే పెట్టి అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ ఉంటోంది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీతిసింగ్ పేరు కూడా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత పలు రకాల ఎంక్వయిరీ చేసి అధికారులు అందరినీ వదిలి వేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్లీ డ్రగ్స్ కేసులు రకుల్ ప్రీతిసింగ్ కి నోటీసులు వచ్చినట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

Who is Rakul Preet Singh, that Rhea Chakraborty named during NCB probe in  drug case

గతంలో కొంతమంది ఆధారాలు సేకరించిన ప్రకారం పూరి జగన్నాథ్ ,రవితేజ ,చార్మి, రకుల్, తనీష్, రానా ముమైత్ ఖాన్ ,నవదీప్ తదితరులు ఈ విచారణకు హాజరయ్యారు. రకుల్ గత సంవత్సరం సెప్టెంబర్ 3 వ తేదీన ఈడీ అధికారులు విచారణ చేస్తున్న సమయంలో అత్యవసరం పని ఉంది అంటూ విచారణ మధ్యలో వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రకుల్ కు మళ్ళీ నోటీసులు పంపించారు. ఈసారి ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే రకుల్ మధ్యలో లేచి వెళ్లిపోవడంతో ఈడీ అధికారులకు సందేహాలు చాలా బలపడ్డాయి. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించలేదని అప్పుడు మీడియాలో వార్తలు వినిపించాయి. దీంతో మళ్లీ ఈడీ అధికారులు విచారణ చేపట్టడం ఇదే మొదటిసారి. ఇ విచారణలో ఈడీ అధికారులు ఎలాంటి వాస్తవాలు రాబడతారో చూడాలి. దీంతో గతంలో ఉన్న వారి పైన నోటీసులు ఇస్తారా లేదా సంగతి ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.