మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.
దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్ల ప్రచార కార్యక్రమాలను సైతం ప్రారంభం కానున్నాయి.
అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు రన్ టైమ్ ను లాక్ చేశారట. ఈ సినిమా మొత్తం నిడివి 2 గంటల 35 నిమిషాలు అని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు ఈ రన్ టైమ్ ఒక విధంగా తక్కువేననే చెప్పాలి. ఇటీవల చాలా సినిమాలకు తక్కువ రన్ టైమ్ బాగా కలిసొస్తుంది. ఎలాంటి సాగదీత లేకుండా ఉంటేనే ప్రేక్షకులు బోర్ పీల్ అవ్వకుండా ఉంటాయి. మరి తక్కువ రన్ టైమ్ తో వస్తుండటం చిరుకు ప్లస్ అవుతుందా.. లేదా.. అన్నది చూడాలి.