రష్మిక వెరైటీ ఫోటో షూట్… ఏసుకుంటున్న నెటిజన్స్?

ప్రస్తుతం రష్మిక మందన్న టైం మామ్మూలుగా లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న బేసిగ్గా కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అన్న సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన తొలినాళ్లలోనే స్టార్ హీరోలతో నటించి వరుస విజయాలు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. పుష్ప సినిమా పుణ్యమాని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన జోరు కొనసాగిస్తోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది.

ఆ విషయం కాస్త పక్కన బెడితే, రష్మిక ఎప్పుడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉండటం అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు కాంతార వివాదం వలన వార్తల్లో నిలిచింది. ఇక తాజాగా మరొకసారి తాను ధరించిన డ్రెస్ వల్ల వార్తల్లోకి ఎక్కింది. అవును, ప్రస్తుతం ట్రోలర్స్ ఈ అమ్మడిని ఒక ఆట ఆడుకుంటున్నారు. తాజాగా ముంబైలో నిర్వహించిన ‘గ్రేజియా ఇండియా ‘ అని ఈవెంట్ కి రష్మిక హాజరు అయింది. ఈ ఈవెంట్లో రష్మిక బ్లాక్ బెల్ట్ కరాటేకు సంబంధించిన డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. కరాటేకు సంబంధించిన డ్రెస్ ధరించటంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది ఇపుడు.

ఈ డ్రెస్ లో రష్మిక ఇచ్చిన ఫోజులు కొన్ని దారుణంగా వున్నాయంటూ ట్రోలర్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఒక పిక్ లో అచ్చం టాయిలెట్లో కూర్చున్నట్లే ఉందని గుసగుసలాడుకుంటున్నారు. పదేపదే ఈ ఫోటోనే షేర్ చేస్తూ ట్రోల్ చేయడం కాస్త విడ్డురమే అని చెప్పుకోవాలి. అయితే ఆమె అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తూ ఫోటోలకు లైక్, షేర్ చేస్తూ వాటిని వైరల్ చేయడం విశేషం. రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో పుష్ప టు సినిమాతో పాటు తమిళ, హిందీ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.