పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో `భవదీయుడు భగత్ సింగ్` అనే మూవీని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా బయటకు వదిలారు. కానీ గత కొంతకాలం నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాపై మేకర్స్ సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ చేశారు.
ఈ సినిమా టైటిల్ ను `ఉస్తాద్ భగత్సింగ్` గా మారుస్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. `మనల్ని ఎవడ్రా ఆపేది` అనే టాక్ లైన్ ను తగిలించారు. ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంటూ థీమ్ లైన్ ను కూడా ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.
సీనియర్ డైరెక్టర్ దశరథ్ ఈ మూవీ కి స్క్రిప్ట్ అందిస్తుంటే.. అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఇది తమిళ సూపర్ హిట్ `తెరి`కి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. తెరి రీమేక్ మాకు వద్దంటూ పవన్ ఫ్యాన్స్ గత కొద్ది రోజులుగా నెట్టింట తెగ రచ్చ చేస్తున్నారు. మరి హరీష్ పవన్ కోసం కొత్త కథను రెడీ చేశాడా..? లేదా తెరి రీమేక్ తోనే వస్తున్నాడా..? అన్నది తెలియాల్సి ఉంది.
https://twitter.com/MythriOfficial/status/1601753510844198912?s=20&t=OqS-WGnTflYcUmdyhIqA0A