మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా ఇందులో హీరోయిన్లుగా నటిస్తే.. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇందులో మత్స్య కారుల నాయకుడు వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, ఏసీపీ విక్రమ్ సాగర్ గా రవితేజ కనిపించబోతున్నారు. రవితేజ సెకండాఫ్ లో వస్తాడని, అతడి పాత్ర బాబీ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడని ఇటీవల చిరంజీవి స్వయంగా వెల్లడించాడు. మొదట ఈ సినిమాలో రవితేజ చాలా చిన్నగా ఉంటుందని అందరూ భావించారు. కానీ, రవితేజ పాత్ర నిడివి దాదాపు నలబై నిమిషాల వరకు ఉంటుందని టాక్ నడుస్తోంది.
అయితే ఈ సినిమాలో నటించడానికి రవితేజ కొన్ని సినిమాలను వదులుకున్నాడని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. చిరంజీవితో సినిమా అనగానే కథ వినకుండానే రవితేజ ఓకే చేశారట. అప్పటికే ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘రావణాసుర’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ని ఇప్పటికే రవితేజ పూర్తి చేయాల్సి ఉంది. కానీ, ఈ సినిమాకు పక్కన పెట్టి మరీ రవితేజ `వాల్తేరు వీరయ్య`ను కంప్లీట్ చేశాడట. ఇక మరోవైపు వేణుశ్రీరామ్ తో ఒక మూవీ చెయ్యాల్సి ఉండగా.. చిరు సినిమా కోసం వదులుకున్నాడట. వేణుశ్రీరామ్ సినిమాతో పాటు మరో కొత్త దర్శకుడి మూవీని సైతం రవితుజ వదులుకోవాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది. ఏదేమైనప్పటికీ.. రవితేజ నటించడం వల్ల `వాల్తేరు వీరయ్య`కు భారీ బజ్ ఏర్పడింది అనడంలో సందేహమే లేదు.