వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ఈ సినిమా హిట్టా.. ఫట్టా.. అన్నది తేల్చేశారు. `చిరంజీవిగారు దయచేసి ఇలాంటి రొమాంటిక్ రోల్స్ చేయడం మానేసి, సీరియస్ రోల్స్ చేస్తే బెటర్. మిమ్మల్ని ఆ తరహా పాత్రల్లో చూసి బోర్ కొట్టేసింది. వాల్తేరు వీరయ్య చిరంజీవికి మరో డిజాస్టర్ కానుంది` అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేశాడు.
వాల్తేరు వీరయ్య మూవీలో ఎలాంటి కొత్తదనం లేదని, ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని ఉమర్ సంధు పేర్కొన్నాడు. ఈయన రివ్యూ ఇప్పుడు మెగా అభిమానులు తీవ్రంగా నిరాశ పరుస్తోంది. అయితే ఉమర్ సంధు రివ్యూస్ లో ఖచ్చితత్వం ఉండదనే వాదన ఎప్పటి నుంచో ఉంది. గతంలో డిజాస్టర్ సినిమాలకు కూడా ఆయన భారీ రేటింగ్స్ ఇచ్చేవాడు. అలాగే హిట్ సినిమాలను డిజాస్టర్ అంటూ రివ్యూలు ఇచ్చిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. మరి `వాల్తేరు వీరయ్య` విషయంలో ఈయన రివ్యూ నిజమవుతుందా.. లేదా.. అన్నది చూడాలి.