తెలుగు హీరోలు టాలీవుడ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్నారా..?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శక, నిర్మాతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇక పై టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ సైతం హీరోలకు జోడిగా నటించడం అంత ఆశ మాసి అయిన విషయం కాదని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఒక సినిమానీ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియార అద్వానీ నటిస్తున్నది. అలాగే మరొక నటుడు ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టులో కూడా జాన్వీ కపూర్ నీ ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ లో నటిస్తున్న జాన్వి ఈ సినిమాలో నటించి సక్సెస్ సాధిస్తే సౌత్ లో కూడా మరిన్ని అవకాశాలు వెలుపడతాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇక మహేష్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి కూడా బాలీవుడ్ హీరోయిన్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలో దీపిక పదుకొనే నటిస్తున్నది.

టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లపై దృష్టి పెడుతున్నారు టాలీవుడ్ హీరోయిన్లకు షాక్ ఇచ్చే విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల బడ్జెట్ లు కూడా దాదాపుగా రూ.300 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ప్రాధాన్యత తగ్గిపోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎవరి హవా ఎక్కువగా ఉంటుందో చూడాలి మరి.