2022 తనకి ఎంతో స్పెషల్ అంటున్న అనుపమ పరమేశ్వరన్… ఎందుకో తెలుసా?

అనుపమ పరమేశ్వరన్… ఈ రింగు రింగుల జుట్టు సుందరాంగి అంటే తెలుగు కుర్రాళ్లకు మక్కువ ఎక్కువ అని చెప్పుకోవాలి. బేసిగ్గా మలయాళీ నటి అయినటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తిష్ట వేసింది. కాగా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అమ్మడు కనువిందు చేసింది. ఆగస్టు నెలలో రిలీజైన కార్తికేయ 2సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం హీరో నిఖిల్ అనుపమ ఇద్దరూ మరోసారి 18 పేజెస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పలకరించారు.

కాగా ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడం పట్ల అనుపమ మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదంతా ఒకెత్తయితే డిసెంబర్ 29వ తేదీన మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధమయ్యారు. ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో జెన్ నెక్ట్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం బటర్ ఫ్లై. ఈ సినిమా 29వ తేదీ థియేటర్లో కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTTలో విడుదల కానుంది. అనుపమ నటించిన మొదటి సినిమా ఇలా మొదటిసారి థియేటర్లో కాకుండా OTTలో ప్రసారం కానుండటం విశేషం.

కాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం తాజాగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనుపమ మాట్లాడుతూ… పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సదరు సినిమాలో తాను గీత అనే పాత్రలో నటించానని ఆ పాత్ర తనకి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది. అలాగే ఈ ఏడాది గురించి మాట్లాడుతూ తనకు చాలా బాగా కలిసి వచ్చిందని… కార్తికేయ 2,18 పేజెస్ వంటి సినిమాలు తనకి మంచిపేరు తీసుకువచ్చాయని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ సినిమాలలానే బటర్ ఫ్లై సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనుపమ తెలియజేశారు.