ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తలా తొక్క లేని వార్తలు ఎన్నెన్నో పుట్టుకొస్తున్నాయి . అయితే అందులో వచ్చిన వార్తలన్నీ ..అబద్ధమని చెప్పడానికి లేదు ..అలా అని నిజమని చెప్పడానికి లేదు ..మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై ఈ రోజుల్లో ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో మనకు తెలిసిందే . మొన్నటికి మొన్న మెగా కోడలు ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కంటుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే సోషల్ మీడియా లో వినిపించే ఇలాంటి వార్తలకి మెగా కోడలు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
బేబీ బంప్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ..తద్వార ఆమె సరోగసి ద్వార బిడ్డను కన్నట్లేదంటూ చెప్పకనే చెప్పేసింది . అంతేకాదు రీసెంట్ గా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .దగ్గుబాటి వారసుడు రానా కి ఆరోగ్య సమస్య ఉందని .. ఆ కారణంగానే ఆయనకు పిల్లలు కలగడం లేదని ..ఇందుకు రానా.. ఆమె ఆయన భార్య మిహికా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
అంతేకాదు రానా దగ్గుబాటి ..అపోలో హాస్పిటల్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారన్న వార్తలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటి అపోలో హాస్పిటల్ లో స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు . దీనిపై ఇప్పటివరకు రానా దగ్గుబాటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మిహీక కూడా అలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు.
దీంతో ఇదంతా సోషల్ మీడియాలో వినిపించే ఓ పుకారు మాత్రమే అంటున్నారు రానా ఫ్యాన్స్. అయితే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయినప్పుడు సదరు స్టార్స్ రియాక్ట్ అయితే ఫ్యాన్స్ కొంచెం కూల్ అవుతారని .. దయచేసి రూమర్స్ కి చెక్ పెట్టడానికి రానా కానీ మిగతా వాళ్ళు కానీ నోరు విప్పాలని కోరుకుంటున్నారు అభిమానులు . చూడాలి మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే రానా నోరు విప్పాల్సిందే..!!