గోపీచంద్ మలినేని డైరెక్షన్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్ని కూడా పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాదులో మొదలైంది. ఈ సినిమాను 2023లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో చాలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయట.. ఈ క్రమంలోనే ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీన్ సినిమాకే మరింత ప్రత్యేకంగా ఉంటుందని లేటెస్ట్ టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ లో ఒక యాక్షన్ సీన్ ఉంటుందట.. ఈ సీన్ ద్వార బాలయ్య, శృతిహాసన్ పాత్రలకు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు బయట పడతాయని తెలుస్తుంది. బాలకృష్ణ అభిమానులకు ఆ సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపాడు.
ఈ భారీ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కిలక పాత్రలలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతంతం అందిస్తున్నాడు.