సినిమాల‌కు మ‌హాన‌టి గుడ్ బై.. త్వ‌రలోనే బిగ్ అనౌన్స్‌మెంట్‌!?

`మహానటి` సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. త్వరలోనే దీనిపై బిగ్ అనౌన్స్‌మెంట్ సైతం రానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉన్నట్లుండి కీర్తి సురేష్ సినిమాలకు దూరం అవడం ఏమిటా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతోందట. కీర్తి సురేష్ కు తగిన అబ్బాయిని తల్లిదండ్రులు ఇప్పటికే చూశారట. కీర్తి సురేష్ కు సైతం సదరు అబ్బాయి నచ్చడంతో వెంటనే పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వ‌చ్చే ఏడాది ఆరంభంలో నిశ్చితార్థం, ఆ వెంట‌నే పెళ్లి పెట్టుకోవాల‌ని ఇరు కుటుంబ స‌భ్యులు నిశ్చ‌యించుకున్నారట‌.

అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పనుందంటూ ప్రచారం జరుగుతోంది. వివాహం అనంతరం న‌టిగా కాకుండా నిర్మాతగా కొనసాగాలని ఆమె డిసైడ్ అయింద‌ట‌. ఇదే నిజమైతే కీర్తి సురేష్ అభిమానుల గుండెల్లో పిడుగు పడటం ఖాయమని అంటున్నారు.