టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోయిన్ గా తక్కువ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ లయ కూడా ఒకరు. లయది ఏపీలోని విజయవాడ. సీనియర్ హీరో వేణు నటించిన స్వయంవరం సినిమాతో టాలీవుడ్కు ఆమె హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమా తోనే లయ సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో లయకు టాలీవుడ్ లో సూపర్ క్రేజీ వచ్చింది. వరుస సినిమాలతో దూసుకుపోయింది.
లయ గ్లామర్ సినిమాలుకు దూరంగా ఉంటూ.. అచ్చ తెలుగు అమ్మాయిలాగా సంప్రదాయ చీరకట్టులో కనిపించే పాత్రలను ఏంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లయ కెరీర్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఏమిటంటే. ప్రేమించు, మనోహరం, హనుమాన్ జంక్షన్. ఈ భామకు మంచి ఇమేజ్ అయితే వచ్చింది గాని.. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం దక్కలేదు. లయ అందాల ఆరబోతకు దూరంగా ఉండటంతో తన కెరియర్ మధ్యలోనే క్లోజ్ అయిపోయింది.
లయ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నన సమయంలో ఆమెకు పిఆర్ఓ గా సురేష్ కొండేటి ఉన్నారు. ఆ టైంలో సురేష్ కొండెటి ఒక స్టార్ ప్రొడ్యూసర్ చేతులలో తీవ్ర అవమానానికిి గురయ్యారట. అప్పుడు సురేష్ కొండేటి ఎలాగైనా నేను ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్కు ఎదగాలని పట్టుదలతో లయ సహాయం కోరాడట. ఆ టైంలో నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. లయ దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుని సంతోషం సినిమా డిస్టిబ్యూషన్ రైట్స్ కొనుక్కున్నాడు.
ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవ్యడంతో అతనికి మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారి ప్రతి సంవత్సరం సంతోషం పేరుతో అవార్డులు ఇస్తూ టాలీవుడ్ లోనే మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన ఈ పొజిషన్లో ఉండటానికి కారణం హీరోయిన్ లయ అని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.