సీనియర్ హిరోయిన్ ఖుష్బుకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు రావడంతో ఆమొ అభిమానులు కోంత ఆందోళనకు గురవుతున్నారు. కోలీవుడ్లో ఖుష్బుని అక్కడ వారు దేవతలా పూజిస్తారు. అలాంటి మా ఆరాధ్య హీరోయిన్ ఆరోగ్యం పదేపదే ఇబ్బందులు పడటంతో ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె తన బరువును గణనీయంగా తగ్గించుకున్న విషయం మనకు తెలిసిందే.అప్పటినుంచి ఆమె అనారోగ్యానికి గురవుతుందని ఆమె అభిమానులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇప్పుడు మళ్ళీ ఖుష్బు ఆస్పత్రిలో జాయిన్ అయ్యానని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆమె వెన్నుముక సమస్యతో హాస్పిటల్లో చేరాను అని. రెండు రోజులు విశ్రాంతి తీసుకోమన్నారని ఆమె సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసింది. అంతేకాకుండా అభిమానులకు దసరా శుభాకాంక్షలను తెలిపింది. దాంతో ఆమె అభిమానుల నుండి ఆ ట్వీట్ కు మిశ్రమ స్పందన వస్తుంది. ‘గెట్ వెల్ సూన్, టేక్ కేర్ మేడం’ అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చెశారు.. వారిలో మరి కొందరు అసలు ఖుష్బుకి ఏమైంది..? ఈమధ్య ఎక్కువగా ఎందుకు అనారోగ్యానికి గురవుతుంది..? ఆమె బరువు తగ్గిన కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయా..? అని అభిమనులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె ఈ హాస్పటల్ లో జాయిన్ అవ్వటానికి ముందు ఆమె సోదరుడు నటించిన ఓ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో ఎంతో హుషారుగా కనిపించింది. ఆడియో రిలీజ్ మధ్యలోనే అస్వస్థతకు గురవడంతో దగ్గరలో ఉన్న అపోలో ఆసుపత్రుల్లో జాయిన్ చేశారు. ఖుష్బూ త్వరగా కోలుకోవాలని పలువురి నటీమణులు కూడా సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. వారు పెట్టిన కామెంట్లకు ఖుష్బూ భర్త డైరెక్టర్ సుందర్ వారికి తిరిగి రిప్లై ఇస్తున్నారు.