నడివయసులోకూడా రమ్యకృష్ణను చూస్తే యువతులు కుళ్ళుకోవాల్సిందే… ఈ ఫొటోలు చూడండి!

రమ్యకృష్ణ… పరిచయం అక్కర్లేని ఓ అందాలతార. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కృష్ణవంశీ భార్య. 90sలో ఒక వెలుగు వెలిగిన ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈమె ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్… ఇలా ఒకరేమిటి భారతీయ అగ్రహీరోల అందరితోనూ ఈమె నటించి మెప్పించింది. 1985లో భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసి అనతికాలంలోనే మంచినటిగా పేరు సంపాదించింది.

అయితే అంత త్వరగా ఆమెకి గుర్తింపు రాలేదు ఈమెకి. మొదట్లో ఆమె చేసిన సినిమాలు దాదాపుగా ప్లాపులు అవ్వడంతో ఐరెన్ లెగ్ అనే పేరుని మూటకట్టుకుంది. ఇక సెంటిమెంటుకి పెద్దపీట వేసిన తెలుగు సినిమా పరిశ్రమ ఓ దశలో ఈమెని విస్మరించింది. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు రాధావేంద్రరావు ఈమెకి ఓ సినిమాలో అవకాశం ఇవ్వగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక అప్పటినుండి ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.

1990 నుండి 2000 వరకు దాదాపు ఓ దశాబ్ద కాలంపాటు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లో తనదైన నటనతో దూసుకుపోయింది. ఇక నరసింహ అనే చిత్రంలో రజినీకాంత్ తో పోటీపడి మరీ చేసిన ‘నీలాంబరి’ పాత్ర ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా భారతదేశంలో కాకుండా, సింగపూర్, ఫ్రాన్స్, జపాన్, లండన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇకపోతే 5 పదుల వయసులో కూడా రమ్యకృష్ణ అందానికి అసూయ తెప్పించేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే మీకే అర్ధం అవుతుంది, చూడండి.