కృష్ణం రాజు మరణ బాధ నుండి ప్రభాస్ ని బయటపడేసింది ఆ హీరోనే..ఏం చేసాడో తెలుసా..!

మనకు తెలిసిందే రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మృతి చెందారు. సెప్టెంబర్ 11న అనారోగ్య కారణంగా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు హాస్పిటల్ లోనే తుది శ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ సింటమ్స్ కారణంగా అనారోగ్యానికి గురైన కృష్ణంరాజు కొంతకాలంగా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్లోనే చికిత్స అందించారు కుటుంబ సభ్యులు . అయితే ఈ విషయం కృష్ణం రాజు మరణించే వరకు బయటకు రానివ్వలేదు రెబల్ ఫ్యామిలీ .

 

ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో సెప్టెంబర్ 11న ఆయన హాస్పిటల్ లో తన తుది శ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ, రాజకీయ లోకం శోకసంద్రంలో నిండిపోయింది. పలువురు సినీ సెలబ్రిటీస్ రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజుతో ఉన్న తమ ఫ్రెండ్షిప్ ను బయటపెట్టారు . ఆయన లేని లోటు ఇండస్ట్రీకి రాజకీయానికి తీరలేనిది అంటూ కన్నీరుగా వినిపించారు. అయితే పెదనాన్న మరణంతో ప్రభాస్ మరింత డల్ అయ్యారు. పెదనాన్న పార్థివ దేహం వద్ద ప్రభాస్ కూర్చొని విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యాలు చూసిన రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ ని అలా ఏడుస్తూ చూడలేం అంటూ కామెంట్స్ చేశారు .

అయితే కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్కు అందరికన్నా ఎక్కువ హెల్ప్ చేసింది ఆయనను ఆ బాధ నుండి బయటకు పడేలా చేసింది మాత్రం గోపీచంద్ . మనకు తెలిసిందే టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ . జాన్ జిగిడి దోస్తులు. ఇద్దరు వేరు వేరు పొజిషన్స్ లో ఉన్నా కానీ ఫ్రెండ్షిప్ అనే పేరుతో ఇద్దరు కలుస్తూ ఉంటారు .మాట్లాడుకుంటూ ఉంటారు .ఈ క్రమంలోనే ప్రభాస్ కి వాళ్ళ పెదనాన్న ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గోపీచంద్ కి బాగా తెలుసు . అందుకే ఆయన మరణం తర్వాత గోపీచంద్ నే ప్రభాస్ ని దగ్గరుండి చూసుకున్నారట. అంతేకాదు కొన్ని రోజులు ఆయన వద్ద ఉండి ప్రభాస్ ని ఆ బాధ నుండి ..ఆ మరణ విషాదఛాయలు తొలగిపోయే వరకు హెల్ప్ చేశారట . మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఆయనను మళ్ళీ మామూలు మనిషిని చేశారట . ఏది ఏమైనా ఫ్రెండ్షిప్ అంటే ఇదే . మిగతా హీరోల లాగా డబ్బులు కోసం గోపీచంద్ ఆయన చుట్టూ తిరగలేదు . నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వేరా అంటూ గోపీచంద్ ని పొగిడేస్తున్నారు.