ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మతో… టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ ఏం చేశాడంటే…!

టీమిండియాకు దక్షిణాఫ్రికా తో జరుగుతున్న వన్డే సిరీస్ లకు కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ బాలీవుడ్ డబుల్ ఎక్సెల్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషీ నటిస్తున్న సినిమాలో ఈ స్టార్ క్రికెటర్ నటించబోతున్నాడు. కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చేనెల నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న హ్యూమా ఖురేషీతో శిఖర్ ధావన్ కలిసి రొమాంటిక్ డాన్స్ చేస్తున్న ఒక సీన్ నీ instagram లో పోస్ట్ చేసింది. ఆమె ఆ పోస్ట్ కి” క్యాట్‌ ఈజ్‌ ఔట్‌ ఆఫ్‌ ది బ్యాగ్‌… ఫైనల్లీ ” అంటూ శిఖర్ ధావన్ ని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ క్రికెట్ అభిమానులతో పాటు బాలీవుడ్ అభిమానులను కూడా తెగ ఆకర్షిస్తుంది.

ఈ సినిమా విషయానికొస్తే… సత్రమ్ రమణి దర్శకత్వంలో వస్తున్న డబుల్ ఎక్సెల్ సినిమా అధిక బరువు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలు చూపించబోతున్నారు. ఈ సినిమాలో హ్యూమా ఖురేషి, తోపాటు సోనాక్షి సిన్హా కూడా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో శిఖర్ ధావన్ ఒక అతిధి పాత్రలో కనిపించనున్నాడు.. ఈ సినిమా కోసం హీరోయిన్ లు ఇద్దరు తమ బరువును బాగా పెంచారు… ఈ సినిమానే తెలుగులో అనుష్క నటించిన సైజ్ జీరో సినిమాకు రీమేక్ గా వస్తుందని తెలుస్తుంది.ఈ సినిమాతో శిఖర్ ధావన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Huma Qureshi (@iamhumaq)