నాగార్జునను నమ్మించి మోసం చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో మన్మధుడుగా పేరు సంపాదించారు. ఇప్పటికీ యువ హీరోలకు దీటుగా తన అందాన్ని కాపాడుకుంటూ ఉన్నారు నాగార్జున. టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాకుండా ఇతర సినీ హీరోయిన్లు సైతం నాగార్జున తో నటించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే తన సినీ కెరియర్లు మొదటిసారి ఒక హీరోయిన్ తో నటించాక.. ఇంకొకసారి ఆ హీరోయిన్ ముఖం కూడా చూడకూడదని అనుకున్నారట నాగార్జున. మరి ఆ హీరోయిన్ ఎవరు అలా ఎందుకు అనుకున్నారు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Manmadhudu' (2002)

నాగార్జున కెరియర్ లో మన్మధుడు చిత్రం ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇప్పటికి బుల్లితెరపై ప్రసారమైతే ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున నటన ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమా చూశాక చాలామంది స్టార్ హీరోల భార్యలు నాగార్జునకు ఫిదా అయిపోయారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా అన్షు అంబానీ, సోనాలి బింద్రే నటించారు. నాగార్జున, సోనాలి బింద్రే కాంబినేషన్లో వచ్చిన అన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

Manmadhudu: 15 years since release, this Nagarjuna-starrer still feels like  sunshine on a cold day-Entertainment News , Firstpost
ఈ సినిమా షూటింగ్ అయిపోయాక సోనాలి బింద్రే నాగార్జునతో మరొక సినిమాలో కూడా హీరోయిన్గా చేస్తానని మాట ఇచ్చిందట. తెర పైన వీళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడం జరిగింది. ఇక వీరిద్దరూ చాలా రోజులపాటు స్నేహితులుగా కూడా కొనసాగారు.ఇక కొన్ని రోజుల తర్వాత నాగార్జున తన సినిమాలో హీరోయిన్గా సోనాలి బింద్రేను తీసుకుందామని స్వయంగా నాగార్జున కలిసి సినిమాలో నటించమని కోరాడట. కానీ సోనాలి బింద్రే ఏం మాట్లాడకుండా ఉండిపోయిందట. అంతేకాదు ఒకానొక సమయంలో ఫోన్ చేసిన కూడా సోనాలి బింద్రే లిఫ్ట్ చేయకుండా నాగార్జునను చాలా హార్ట్ చేసిందట. దీంతో ఈ ముద్దుగుమ్మను నాగార్జున అవాయిడ్ చేసినట్లు సమాచారం ఇక ఆ కారణంతోనే మళ్లీ ఈ ముఖం చూడకూడదని నాగార్జున నిర్ణయించుకున్నట్లు సమాచారం.