తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు బుల్లితెర పైన తన హవా బాగా కొనసాగించిందని చెప్పవచ్చు. మంత్రి పదవి రావడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి ప్రజలకు సేవ చేస్తూ ఉంది రోజా. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలలో తన హవా కొనసాగిస్తూనే మరొకవైపు రాజకీయ నేతగా కూడా ప్రేక్షకులలో పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుని రోజా తప్పు పట్టడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.
చంద్రబాబుకి దత్తపుత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఉత్తరాంధ్ర వలసల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి వలసల గురించి మాట్లాడలేదు అంటూ రోజా ఫైర్ అయ్యింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోను మళ్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అని రోజా తెలియజేసింది. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికల పై మాత్రమే కనిపిస్తూ ఉంటారని వరుస ట్వీట్లు చేస్తూ ఉన్నారని ఆ ట్విట్లకు దీటుగా స్పందించింది రోజా.
అయితే దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు గతంలో కూడా చంద్రబాబుకు మీరు దత్తపుత్రికగా వ్యవహరించారా.. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికి దత్తపుత్రిక అయిపోయారా అంటూ మండిపడుతున్నారు. గతంలో చంద్రబాబును పొగిడి ఆప్పుడు రాజశేఖర్ రెడ్డిని విమర్శించిన రోజా అప్పట్లో టిడిపినే రాష్ట్రాన్ని ఉద్ధరించలేదని చెప్పొచ్చు కదా అంటే జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో అటు రాజకీయాలలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పాడా అనే విషయం మాత్రం ఇంకా అభిమానులలో సందిగ్ధత నెలకొంది.
దేనికి గర్జనలు?
మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?
— Pawan Kalyan (@PawanKalyan) October 9, 2022