నటసింహ బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం చెమటలు పట్టించే విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటించడమే కాకుండా తన సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ కలెక్షన్ విషయంలో దూసుకుపోతున్న బాలకృష్ణ నటన , ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మాస్ యాక్షన్ తో ప్రేక్షకులలో ఉర్రూతలూగించే బాలయ్య.. అప్పటికి ,ఇప్పటికీ తన నటనలో ఏమాత్రం మార్పు రాలేదు అని నిరూపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటించి అభిమానులకు ఆనందాన్ని కలిగించారు.
ఇదిలో ఉండగా బాలకృష్ణ.. సూపర్ హిట్ సినిమా క్రాక్ మూవీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ కూడా పూర్తయింది. యాక్షన్ ఫిలిం గా తెరకెక్కపోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో శృతిహాసన్ , వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ తో పాటు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేస్తామని డేట్ ను కూడా లాక్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాను కేవలం #NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో మాత్రమే ఇప్పటివరకు సినిమాను పూర్తి చేశారు. అయితే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనే సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది.
ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. బాలకృష్ణ నటిస్తున్న తన 107వ చిత్రానికి రెడ్డి గారు లేదా వీరసింహారెడ్డి అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ రెండింటిలో ఒకటి కచ్చితంగా ఫిక్స్ చేయబోతున్నారట. ఈ రెండు టైటిల్స్ కూడా యాక్షన్ సినిమాకి తగ్గట్టుగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలియగానే అభిమానులలో సంతోషం వ్యక్తం అవుతుంది. మరి చివరిగా ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారో తెలియాల్సి ఉంది.