త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తన తర్వాత సినిమాలాన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ గా తీస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ కొత్త షెడ్యూల్ సోమవారం నాడు రాజమండ్రి దగ్గర మారేడు మల్లి పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభనికి ముందే రామ్ చరణ్ సినిమా యూనిట్ అందరూ అక్కడికి చేరుకున్నారు. ఈ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వారం రోజులపాటు జరగనుంది. ఈ షూటింగ్లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడని.. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా వస్తుందని ఓ టాక్ నడుస్తుంది.
ఇక్కడ రామ్ చరణ్ ఏ సినిమా షూటింగ్ చేసిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కీయరా అద్వాని నటిస్తుంది. ఇక్కడ షూటింగ్ మొదలైందో లేదో ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లీక్లు గండం మాత్రం పోవడం లేదు. ఎంత కట్టు ధిట్టమైన భద్రత ఉన్న షూటింగ్ కు సంబంధించిన ఏదో ఒక ఫోటో లీక్ అవుతూనే ఉంది. ఇప్పుడు తాజా షెడ్యూల్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.