పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో రష్మీకకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది . మరి ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరొ క్రేజీ ఆఫర్ ఈ భామకు వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి సిరీస్ లో మరో కొత్త సినిమా రానుంది.
ఇందులో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆషీకీ సిరీస్ లు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో నటించిన వారంతా ఇప్పుడు స్టార్లుగా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఆషీకీ 3 కోసం రంగం సిద్ధమవుతుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన టి సిరీస్ నిర్మిస్తున్నట్టు అధికార ప్రకటన చేసింది. ఇందులో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు.. అతనికి జంటగా రష్మికను ఓకే చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు అనురాగ్ బాసు దర్శకత్వం అందిస్తున్నాడు. ఇక రష్మిక ఆషికి 3లో హిరోయిన్ గా నటించడం గ్యారెంటీ అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. రష్మిక మందన మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీంతో రష్మిక బాలీవుడ్ లో సెట్లయినట్టే అనే వార్తలు కూడా వస్తున్నాయి.