చిరంజీవి ఇచ్చిన బంపర్ ఆఫర్ ని పూరీ వాడుకుంటాడా?

ఈమధ్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరీజగన్నాధ్ ఓ కీలక రోల్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసినదే. ఆచార్య ప్లాప్ అయిన తరువాత ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఫ్యాన్స్ కి మరింత చేరువగా ఉండటానికి సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మొదటి సారి పూరి జగన్నాథ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆశ్చర్యపోయేలా చేసారు.

ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా విశేషాలపై ఇరువురు మాట్లాడారు. ఆమధ్యలో చిరంజీవి లైగర్ సినిమా గురించి పూరి జగన్నాథ్ ని అడిగారు. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత మళ్ళీ కొత్త కథ రాసుకోవడానికి బొంబాయి వెళ్లిపోయానని పూరి ఈ సందర్భంగా చెప్పాడు. ఇంటర్వ్యూ ఇక ముగిస్తారు అనుకొనేలోపు చిరు పూరీని ఓ ఆసక్తికరమైన విషయాన్ని అడిగాడు. అవును, తన ఆటోజానీ కథ ఏమైందని అడిగాడు చిరు. దానికి పూరీ ఆ కథ అవుట్ డేటెడ్ అయిపోయిందని, దానిని వదిలేసా అని చెప్పారు. ఇప్పుడు మరింత కొత్త కథని మీ కోసం సిద్ధం చేస్తున్నా అని పూరి జగన్నాథ్ ఈ సందర్భముగా చెప్పాడు.

నీతో సినిమా చేయడం కోసం నేను వెయిట్ చేస్తున్నా అని చిరంజీవి పూరి జగన్నాథ్ కి ఆఫర్ ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. ఇక ఈ విషయం బయటపడినప్పటినుండి మెగాభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ కుదిరితే మాత్రం రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయమని అంటున్నారు. ఇకపోతే లైగర్ ఫ్లాప్ తో సంబంధం లేకుండానే పూరి జగన్నాథ్ టాలెంట్ పై చిరంజీవి నమ్మకం పెట్టుకోవడం విశేషం. మరి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఆఫర్ ని పూరి జగన్నాథ్ వాడుకుంటాడో లేదో తెలియాలి.