గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగిన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జరిగాయి. అప్పట్లో చిరంజీవి ప్రకాష్ రాజు మద్దతు నిలువగా మోహన్ బాబు, బాలకృష్ణ వంటి వారు సపోర్టు నిలిచారు. దీంతో హోర హోరిగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ విషయం పెద్ద ఎత్తున మీడియా వారు చాలా వైరల్ గా చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం జరిగింది. ఎట్టకేలకు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మంచు విష్ణు మరికొన్ని ఆరోపణలు చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నికై ఏడాది పూర్తయిన నేపథ్యంలో మంచు విష్ణు మీడియా సమూఖంగా మాట్లాడడం జరిగింది. ఇకమీదట రెండు సినిమాలలో నటించిన అవి విడుదలయితే చాలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ల శాశ్వత సభ్యత్వం కలిగిస్తామని తెలిపారు.అలాగే ఐదు నిమిషాలలో నైన సినిమాలలో కనిపించిన డైలాగు చెప్పిన వారికి అసోసియేషన్ సభ్యత్వం కల్పిస్తామని తెలియజేశారు. అయితే అసోసియేట్ సభ్యులుగా ఉన్నవారికి మాలో ఓటు హక్కు ఉండదని తెలియజేశారు.
ముఖ్యంగా గతంలో మెగా క్యాంపుకు చెందిన సురేష్ కొండేటి ఒక జర్నలిస్టు కానీ ఆయన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లకి ఎలా వచ్చారని విష్ణు ప్రశ్నించారు.ఒక డబ్బింగ్ సినిమాని కొనుగోలు చేసి దానిలో ఒక పాట సూట్ చేసి ఆ పాటలో నటించిన అంతమాత్రాన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా సభ్యుడు అయిపోతార అంటు ప్రశ్నించారు. అంతేకాకుండా మా అధ్యక్షుల పైన, మా అధ్యక్షుడి పైన ఎలాంటి పోస్టులు,వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన వారు అనర్హులుగా అవుతారని తెలియజేశారు. మంచు విష్ణు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మెగా క్యాంపును తప్పు బట్టే విధంగా ఉన్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా గతంలో ఒక హీరో తనకు కావాలని డబ్బులు ఇచ్చి మరి మనుషుల్ని పెట్టి ట్రోల్స్ చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే ఆ హీరో ఎవరనే విషయం మాత్రం ఇప్పటికి తెలియజేయలేదు.