బాలయ్య అసలు ఎన్టీఆర్ కొడుకేనా.. లక్ష్మీపార్వతి..!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో అడుగు పెట్టారో కానీ అప్పటినుంచి రాజకీయపరంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు బాలకృష్ణ. ఇక ప్రోమోలో తన వ్యక్తిగత జీవితాల విషయాన్ని రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయాల్లోనూ. ఇక దీంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఎట్టకేలకు నిన్నటి రోజున ఆషో టెలికాస్ట్ అవడం జరిగింది.

The rise and fall of Lakshmi Parvathi

ఇక ఎప్పుడైతే ఈ షో బయటికి రావడం జరిగిందో అప్పటినుంచి టిడిపి పై విమర్శలు కురిపిస్తున్నారు రాజకీయ నాయకులు. అయితే ఈ ఎపిసోడ్ పై ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి స్పందించడం జరిగింది. చంద్రబాబు బాలయ్య తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి షోను ఎంచుకున్నారని అందులో వారు చెప్పిన ఏ విషయంలో కూడా వాస్తవం లేదని తెలియజేస్తోంది లక్ష్మీపార్వతి.1995 లో నాటి ఘటనపై చంద్రబాబు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ కాళ్లు కూడా పట్టుకొని బ్రతిమలాడానన్ని చెప్పారు. ఈ వ్యాఖ్యలను లక్ష్మీపార్వతి తిరస్కరించింది.పార్టీలో గొడవలు చేయించింది తనే, ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు తీసుకువచ్చేలా చేసిందితనే ,ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది కూడా తనే అంటూ తెలియజేసింది.

Is NTR Kathanayakudu in trouble because of his second wife Lakshmi Parvathi?

అయితే ఇవన్నీ నిజాలని ఆయనను ఒప్పుకోమనండి అంటూ సవాలు విసిరింది. ఎన్టీఆర్ కాళ్లు చంద్రబాబు పట్టుకున్నాడు అన్నది పచ్చి అబద్ధమని పేల్చి చెప్పింది. ఈరోజు ఈ షో చూశాక బాలకృష్ణ అంటే పరమ అసహ్యం వేస్తోందని..అసలు అతను ఎన్టీఆర్ కొడుకా అనేంతగా అసహ్యం వేస్తుందని తెలియజేస్తోంది లక్ష్మీపార్వతి. ఈ షో చూసినంత సేపు ఎన్టీఆర్కు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారిద్దరు ఒకరినొకరు సమర్ధించుకుంటూ ఉన్నట్లుగా కనిపించిందని తెలియజేసింది లక్ష్మీపార్వతి. ఇక ఎన్టీఆర్ కు వెన్నుపోటు పోడవడం వంటి సాక్షాలు బయటపడడంతో ఈ విధంగా కప్పిపుచ్చుకుంటున్నారని చెప్పుకొస్తుంది లక్ష్మీపార్వతి.