టాలీవుడ్ లో ఉన్న అందమైన జంటలలో సూపర్ స్టార్ మహేష్-నమ్రత జంట ఒకటి అని మనకు తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుటి నుంచి ఎంత అన్యోన్యంగా వారి ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ముగించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం మహేష్ బాబు ఫారెన్ టూర్ లో ఉన్నాడని తెలుస్తుంది. టూర్ నుంచి వచ్చిన వెంటనే సినిమా షూటింగ్లో బిజీ అవుతాడట.
మహేష్ బాబు ఆయన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆయనకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటంటే మహేష్ బాబు ఓ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ బిజినెస్ను ఆయన భార్య నమ్రత పేరు మీద మొదలు పెట్టనున్నారని సమాచారం అందుతుంది. ఈ విషయం తెలిసి మహేష్ బాబు అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. భార్యపై మహేష్ బాబు ప్రేమను చూపిస్తున్న విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.