సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్న ముఠా అరెస్ట్.. ఒకరు మైనర్..!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై తరచూ నిందితులు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మే 9వ తేదీన మొహలీలోని పంజాబ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పై ఆర్పిజి దాడికి సంబంధించి మైనార్టీతో సహా ఇద్దరు ఉగ్రవాద నిందితులను ఢిల్లీ పోలీసుల అరెస్టు చేశారు. ముఖ్యంగా అరెస్ట్ అయిన నిందితులు తమ విచారణలో నటుడు సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ ను చంపడమే తమ లక్ష్యం అని కొంతమంది గ్యాంగ్ స్టర్లు ప్రకటిస్తున్నారు. ఇంత వరకు ఇలాంటి వార్తలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు ఏకంగా కొంతమంది తీవ్రవాదులు ఆయనను చంపడానికి రెడీ అయ్యారని వార్తలు వినిపిస్తూ ఉండడం తీవ్ర సంచలనానికి దారితీస్తోంది.

మొన్న జరిగిన దాడిలో పోలీసులు కొంతమంది తీవ్రవాదులను అరెస్టు చేయగా విచారిస్తే సల్మాన్ ఖాన్ ను చంపే పనిని ఈ ఉగ్రవాదులకు అప్పగించినట్లు తెలిపారు . ఇక నివేదికల ప్రకారం అర్ష్ దీప్ అనే పేరు మోసిన షూటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒక మైనర్ కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక సిద్దు మోసేవాలా హత్య కేసు కు బాధ్యత వహించిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ భిష్ణోయ్.. సల్మాన్ ఖాన్ ను అంతమొందించడానికి ఒక మైనర్ కి టాస్క్ కూడా ఇచ్చాడని , తర్వాత ఈ పనిని మైనర్ నుంచి అమృత్ సర్లో రానా కండోల్వాలియాకు కాంట్రాక్ట్ ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు.

ఇకపోతే ఫైజాబాదుకు చెందిన ఆ మైనర్ గుజరాత్ లోని జాంనగర్లో అరెస్టు చేయగా స్పెషల్ సెల్ నుండి అందిన సమాచారం ప్రకారం.. రాకెట్ లాంచర్ నుండి కాల్పుల కేసులో ఒక మైనర్ యువకుడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ తో మాత్రమే కాకుండా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదినిండా లారెన్స్ తో కూడా సంబంధం కలిగి ఉన్నారు. అయితే అందరూ కలిసి ఎందుకు సల్మాన్ ఖాన్ చంపాలనుకుంటున్నారు అనే విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఈ విషయం తెలుసుకున్న తర్వాత సల్మాన్ ఖాన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.