`బింబిసార 2` సెట్స్ మీద‌కు వెళ్లేది అప్పుడే.. డైరెక్ట‌ర్ న‌యా అప్డేట్‌!

యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి డైరెక్షన్ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పిరియాడిక్ ఫిక్షనల్ డ్రామా `బింబిసారా`. కే హరికృష్ణ ఎన్టీఆర్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన `బింబిసార` సినిమా ఆయన కెరీర్ కు మంచి సక్సెస్ను ఇచ్చిందని చెప్పాలి.

టాలీవుడ్ కష్టకాలంలో ఉంటే`బింబిసారా` సినిమా ఊపిరి పోసింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. ఆయన అన్నట్టుగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి సన్నహాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

అయితే మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే డైరెక్టర్ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ మీద పనిచేస్తున్నారట. డైరెక్టర్ మాట్లాడుతూ.. కళ్యాణ్ రామ్ ఇతర కమిట్ మెంట్స్ కారణంగా వచ్చే ఏడాది జూన్ జూలై నాటికి ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఆయన తెలిపారు. అయితే మొదటి పార్ట్ మంచి సక్సెస్ను అందుకోవడంతో తమ మీద ఒత్తిడి బాగా ఉందని పైగా పార్ట్ 1 కు రిలేటెడ్ గా పార్ట్ 2 ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఆయన చెప్పిందాన్ని బట్టి చూస్తే బింబిసారా పార్ట్ 2 వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా పార్ట్ 2 కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.