టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ . ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్ లతో దూసుకుపోతుంది. ఆచార్య అలాంటి డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ తో సాలిడ్ హెట్ తో కం బ్యాక్ ఇచ్చాడు. సినిమా సూపర్ హిట్ అవడంతో చిరంజీవి ఫుల్ జోష్ మీద ఉన్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ లు పలు ప్రాంతాల్లో నిర్వహిస్తుండగా… తాజాగా ఓ ప్రెస్ మీట్లో చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకుచ్చాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో మన సీనియర్ హీరోలు విక్టరీ వెంకటేష్ , నందమూరి బాలకృష్ణ ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. చిరంజీవిని ఓ విలేకరి మీరు కూడా ఓటీటీ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని అడగగా… “తాను ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మంచి స్టోరీ సబ్జెక్ట్ ఏదైనా దొరికితే అందులో కూడా నేను డెఫినెట్గా చేస్తానని” చిరంజీవి అన్నాడు.
ఈ క్రమంలోనే లాక్ డౌన్ టైంలో తను ఏవేవో ఒప్పుకున్నట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ వాటిలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాను బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు చేసానని కూడా గుర్తు చేశారు..చిరంజీవిమాటలు బట్టి ఆయన త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్యబోతున్నారని తెలుస్తుంది. ప్రముఖ సంస్థ ద్వారా ఆయన ఓటీటీలోకి అడుగుపెడుతున్నారని.. దీనిపై త్వరలోనే అధికారి ప్రకటన రానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.