it’s Official: అభిమానుల కోరిక తీర్చేసిన బాలయ్య ..ఇక రచ్చ రంబోలా.!!

సినీ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే . అభిమానుల కోసం ఎలాంటి పని అయినా చేయడానికి ఫస్ట్ ఉండే హీరో ఎవరంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు నందమూరి బాలకృష్ణ . ఆయనకు కోపం వచ్చినా ఆపలేం ..ప్రేమ వచ్చినా తట్టుకోలేం. అభిమానుల కోసం ఎలాంటి పని అయినా సరే ఆలోచించకుండా చేసేస్తాడు ..మంచి చేస్తే శభాష్ అంటూ పొగిడే ఆ చేతులే.. తప్పు చేస్తే చెంప చళ్లుమనిపిస్తాడు అలాంటి మహానుభావుడు ఈ నందమూరి నటసింహం బాలయ్య.

కాగా, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ నేనే నెంబర్ వన్ అన్నట్లు అన్ని రంగాల్లోను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. బాలయ్య ఆహా వారితో కలిసి హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే . అన్ స్టాపబుల్ సీజన్ వన్ పేరిట సూపర్ డూపర్ టాక్ షో ని హోస్ట్ చేసి ఓటిటిలో నెంబర్ వన్ షో గా తీసుకోవచ్చారు . కాగా సీజన్ వన్ అన్ స్టాపబుల్ బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో ..సీజన్ 2 రీసెంట్ గానే ప్రారంభించారు .

కాగా మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ గెస్ట్ లుగా వచ్చారు. రెండో ఎపిసోడ్ కి విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ గెస్ట్లుగా వచ్చారు . కాగా ఎప్పటి నుంచో అన్ స్టాపబుల్ షో కి హీరో శర్వానంద్ తీసుకోరండి అంటూ బాలకృష్ణకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు . కాగా ఈ క్రమంలోనే సీజన్ వన్ లో తీర్చుకోలేని ఆ కోరిక సీజన్ 2 లో .. అభిమానులు కోరిక నెరవేర్చారు బాలయ్య .

అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 3 కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ఆహా టీం రిలీజ్ చేశారు. యంగ్ హీరోస్ అడవి శేషు, శర్వానంద్ కలిసి వచ్చి సందడి చేశారు. ఓ ఫోటో రిలీజ్ చేసి మూడో ఎపిసోడ్ కి గెస్ట్లుగా అడవి శేషు , శర్వానంద్ అంటూ అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు . దీంతో అభిమానుల కోరిక తీర్చేసిన బాలయ్య అంటూ జనాలు మెచ్చుకుంటున్నారు .