బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో ఆ ఖతర్నాక్ హీరో.. బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!

మైత్రి మూవీ బ్యానర్ పై ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ- శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ ఈ మధ్యనే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది.

ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెండు సాంగుల షూటింగ్ మాత్రం మధ్యలో ఆగింది. అయితే ఈ రెండు పాటల్లో ఒకటి మాస్ ప్రేక్షకులు ఉర్రూతలూగించే ఐటమ్ సాంగ్ గా తెలుస్తుంది. ఈ పాట కోసం చంద్రిక రవి అనే మోడల్ ను తీసుకువచ్చారని కూడా తెలుస్తుంది. మోడల్ అయిన ఈమె ఇప్పటికి నాలుగైదు సినిమాల్లో చేసి ఉన్నారు. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో చేయడం ఇదే తొలిసారి. సాంగ్ షూటింగ్ టైం కూడా దాదాపు దగ్గరపడింది అన్నట్లు తెలుస్తుంది.


ఇక ఈ పాట కాకుండా మరో సాంగ్‌ను కూడా సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఈ స్పెషల్ సాంగ్ లో బాలకృష్ణ- శృతిహాసన్ తో పాటు టాలీవుడ్ లో ఉన్న ఓ స్టార్ హీరో ఎవరైనా న‌టిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలు జరుగుతున్నాయని తెలుస్తుంది. కేవలం ఒక రెండు నిమిషాల పాటలో స్పెషల్ అప్పీయరన్స్ ఉండే ఆ క్యారెక్టర్ కోసం ఏ హీరో బాగుంటుందని లెక్కలు కూడా వేస్తున్నారు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాటలో అల్లు అర్జున్ లేదా మహేష్ బాబు గెస్ట్ అపీరియన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో ఈ ఒక్క పాట మాత్రమే షూటింగ్ బకీపడ్డట్టు తెలుస్తుంది. మొత్తం మీద హిట్ కొట్టాలని మైత్రి మూవీ బ్యానర్స్ వీర సింహారెడ్డి సినిమాను ఎంతో కసిగా తయారు చేస్తున్నట్లు కనిపిస్తుంది.