తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ యాక్టర్ గానే ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి హీరోగా కొనసాగుతూ ఉన్నారు బాలకృష్ణ. అంతేకాకుండా యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ తన హవా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు మరొకవైపు ప్రజాసేవ ఎలా అన్నిటిలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు బాలయ్య. అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి చూద్దాం.
RRR చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించి ప్రతి ఒక్కరి నోట ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇంతటి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాతకు ఇప్పటివరకు తన తదుపరి సినిమా అని ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ నిర్మాత త్వరలో ఒక క్రేజీ కాంబినేషన్లో సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో కూడా రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు చేయడం కూడా జరిగింది కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.
ఇప్పుడు తాజగా ఈ నిర్మాత నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేయడానికి చేతులు కలపబోతున్నట్టుగా అది కూడా ఒక యాక్షన్ త్రిల్లర్ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆహా ఓటీటి లో ప్రసారం కాబోతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నారు బాలకృష్ణ. ఇందుకుగాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే బాలకృష్ణ కోసం ఒక కథను వినిపించారట ఇక బాలకృష్ణకు కూడా ఆ కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.