సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్.. ఆ సినిమా ఇప్పట్లో లేనట్లే?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అనూహ్యంగా తనకు డిజాస్టర్ ఇచ్చిన లైగర్ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హీరో తన నెక్స్ట్ సినిమాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తున్నాడు. విజయ్ అగ్ర కథానాయిక సమంత తో కలిసి కృషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అయినా అతనికి తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ క్రమంలో ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఎంజాయ్ చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ సమంత మాత్రం ఈ సినిమా షూటింగ్ కి యాక్టివ్ గా రావడంలేదని తెలుస్తోంది. దానికి కారణం ఆమెకు డేట్స్ ఖాళీ లేకపోవడమేనని టాక్.

విజయ్ చేతిలో ప్రస్తుతానికి ఖుషి సినిమా ఒక్కటే ఉంది. సుకుమార్ తో మరో సినిమా ఉంది కానీ అది ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. సో, ఇప్పుడు ఈ క్రేజీ హీరో ఖాళీగానే ఉంటున్నాడు. ఈ ఖాళీ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నాడు. జిమ్ బాట పట్టి వర్క్ఔట్స్ చేస్తున్నాడు. ఇక ఖుషి సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ అండ్ టీమ్ డిసెంబర్‌లో ఖుషి సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అది జరిగేలా లేదు. ఎందుకంటే సామ్‌ డేట్స్ ఇవ్వడం లేదు. ఫలితంగా షూటింగ్ ముందుగా అనుకున్నట్లు కొంచెం కూడా పూర్తి కాలేదు. సో, ఈ మూవీ రిలీజ్ అయ్యే లోపు ఇంకాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది ఇది సమంత ఫాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక ఖుషి సినిమా గురించి మాట్లాడుకుంటే ఇదొక ప్యూర్ లవ్ స్టోరీగా ఉండబోతుందట. అయితే తాజాగా ఖుషి క్లైమాక్స్ గురించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఖుషి క్లైమాక్స్‌లో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత ఇద్దరు చనిపోతారట. అయితే ఈ ట్రాజెడీని మూవీ లాస్ట్‌లో చూపిస్తే సినిమాపై బాడ్ ఇంప్రెషన్ వస్తుందని సినిమా స్టార్ట్ అవగానే టైటిల్ కార్డ్స్ పడిన వెంటనే హీరో, హీరోయిన్ పాత్రలు మరణించినట్లు చూపిస్తారట. ఆ తరువాత వాళ్లు ఎందుకు చనిపోయారనే దానిగురించి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని స్టార్ట్ చేస్తారట. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీతోనే సినిమా మొత్తం నడిపిస్తారని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సమంత, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇపుడే తెగ బాధపడిపోతున్నారు.