రాజకీయ నాయకులు వారి సంపాదించిన అక్రమ సంపాదనను సినిమాలో పెట్టి వారి సంపాదనను వైట్ మనీ గా మార్చుకోవటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు వచ్చే చాలా సినిమాలకు రాజకీయ నాయకులు వారి పేరు లేకుండా బినామీలతో సినిమాలు తీయించి వారి డబ్బుని వైట్ మనీగా మార్చుకోవటం చాలాసార్లు చూస్తూనేే ఉన్నాం. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఆమె అక్రమ సంపాదనపై ఈడికిి ఫిర్యాదు చేశారు.
తాజాగా వచ్చిన విజయ్ దేవరకొండ- పూరి జగనాథ్ కాంబోలో వచ్చిన ‘లైగర్’ సినిమాకు ఎమ్మెల్సీ కవిత పెట్టుబడి పెట్టిందని ఆరోపించాడు. ఆమె సంపాదించిన బ్లాక్ మనీని ఈ సినిమా ద్వారా వైట్ మనీ గా మార్చుకుందని బక్క జడ్సన్ ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవలని ఈడీని కోరడు.