సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఒక సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలుచక్కెర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శంకర్కు ప్రొడ్యూసర్ దిల్ రాజుకు మధ్య గొడవలు కారణమని వార్త బయటకు వచ్చింది.
ఈ క్రమంలో శంకర్ – కమల్ హాసన్ కాంబోలో భారతీయుడు 2 సినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శంకర్ – రామ్ చరణ్ సినిమా ఆగి పొందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ సినిమా మీద వస్తున్న వార్తలన్నీ నిజం కాదని తన సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ తో వాళ్ళ నోరు మూయించాడు శంకర్.
రామ్ చరణ్ సినిమా తాత్కాలికంగా ఆగిందని శంకర్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్లో మళ్ళీ సెట్స్ మీదకు వెళుతుందని శంకర్ చెప్పాడు. ఈ వార్తతో రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ 2 అలాగే ఆర్సీ 15 ఈ రెండు సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటాయట శంకర్ స్పష్టం చేశారు.