NTR, రామ్ చరణ్ సరసన నిఖిల్.. మేటర్ ప్యాన్ ఇండియా కథ ఇదే!

నేడు తెలుగు సినిమా నేషనల్ లెవల్లో వెలిగిపోతుంది అంటే అంతా రాజమౌళి పుణ్యమే అని చెప్పుకోవాలి. బాహుబలి అనే సినిమా లేకపోతే తెలుగు సినిమా పేరు ప్రపంచానికి తెలిసేది కాదేమో. అంతకు ముందు ఒకరిద్దరు దక్షిణాది దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయిన దర్శకుడు ఒక్క ‘రాజమౌళి’ అనే చెప్పుకోవాలి. బాహుబలితో ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చేసిన జక్కన్న.. ఈ యేడాది RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ప్యాన్ ఇండియా హీరో అనే ఇమేజ్‌ను తీసుకొచ్చారు.


ఈ క్రమంలో తాజాగా కార్తికేయ 2తో ‘నిఖిల్ సిద్ధార్ధ్’ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. RRR మూవీతో NTR పూర్తి స్థాయిలో హిందీతో పాటు మిగతా దక్షిణాది ప్రేక్షకులను పలకరించారు. అంతకు ముందు రామ్ చరణ్.. ‘జంజీర్’ మూవీ రీమేక్‌తో పలకరించినా.. ఆ సినిమాతో విమర్శల పాలయ్యారు. అపుడు తిట్టిన నోళ్లతోనే ఇపుడు పొగడ్తలను వింటున్నాడు. ఈ సినిమాతో వీళ్లిద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్‌ అయిపోయారు. ఇక కార్తికేయ 2 అనే మూవీతో నిఖిల్ బాలీవుడ్‌లో సత్తా చాటాడు. ఈ సినిమా మౌత్ పబ్లిసిటీతో హిందీలో దూసుకుపోతుంది.

ఈ సినిమా ఇప్పటి వరకు హిందీలో రూ. 16.50 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఓవరాల్‌గా రూ. 100 క్లబ్బుకు చేరువలో ఉంది. మొత్తంగా కార్తికేయ 2తో నిఖిల్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుల విషయానికొస్తే.. రాజమౌళి పూర్తి స్థాయిలో ప్యాన్ ఇండియా దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించారు. అతని తరువాత సుకుమార్ ‘పుష్ప’ సినిమాతో సుకుమార్ తనదైన మార్క్ పాన్ ఇండియా స్థాయిలో క్రియేట్ చేసుకున్నాడు. ఈజాబితాలో డైరెక్టర్ ‘సందీప్ రెడ్డి వంగా’ పేరుని కూడా చెప్పుకోవాలి.. తెలుగులో తీసిన అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరిట రీమేక్ చేసి అక్కడ కూడా విజయం సాధించాడు.