ప్రభాస్ అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!!

ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేడు దేశం గర్వించ దగ్గ హీరోగా చలామణి అవుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత పారితోషకం తీసుకునే అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈయన మొదటి పారితోషకం తెలిసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన క్రేజ్ ను పూర్తిగా మార్చేసుకున్నారు అనడంలో సందేహం లేదు. ఇక బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే కథలు వింటూ అదే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరింత దూసుకుపోతున్నాడు.40 All Time Unseen Pics of Actor Prabhas (1979-2022)

కథ , కంటెంట్ తో సంబంధం లేకుండా ప్రభాస్ తెరకెక్కించే ఏ సినిమా అయినా సరే మంచి కలెక్షన్ ను రాబడుతుంది. ఇటీవల వచ్చిన రాధే శ్యామ్ సినిమా కూడా కథపరంగా డిజాస్టర్ గా మిగిలినప్పటికీ కలెక్షన్లు పరంగా మంచి లాభాన్ని పొందింది. ఇక ఈ క్రమంలోనే సలార్, ప్రాజెక్టు కే, ఆది పురుష్ వంటి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇక ఈయన ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారిపోషకం తీసుకుంటున్నారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇటీవల రాబోతున్న ఆది పురుష్ సినిమాకు ఏకంగా రూ.150 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు అంటూ ప్రచారం కూడా జరిగింది.Buzz: Danayya Backed Out From Prabhas' Film

ఇదిలా ఉండక ప్రస్తుతం వందల కోట్ల పారితోషకం తీసుకుంటున్న ప్రభాస్ తన మొదటి సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే వార్త వైరల్ గా మారింది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఇంటర్వ్యూలో భాగంగా ఈశ్వర్ సినిమాకు ఐదు లక్షల పారితోషకం తీసుకున్నాను.. అదే నా మొదటి సంపాదన.. అయితే ఆ డబ్బు ఏం చేశానో కూడా నాకు తెలియదు అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ఇక ఒకవేళ హీరో కాక పోయి ఉంటే ఏం చేసేవారు అని యాంకర్ మరోసారి ప్రశ్నించగా.. ఒక బిజినెస్ మాన్ అయ్యుండేవాన్నీ.. నిజానికి హీరో అవ్వాలని కోరుకోలేదు.. కానీ తప్పని పరిస్థితుల్లో హీరో అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్.