ఇవాళే రిలీజ్.. అప్పుడే ఓటీటీ.. థ్యాంక్యూ అంటోన్న ఫ్యాన్స్!

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ గతకొద్ది రోజులుగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాలో కాస్తో కూస్తో కంటెంట్ ఖచ్చితంగా ఉంటుందని నమ్మేవారు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తూ వచ్చారు. అయితే ఇవాళ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షోకే ‘అమ్మ బాబోయ్’ మీమ్ టాక్ వచ్చేసింది.

ఇదేం సినిమా రా బాబు అనే వారు ఎక్కువగా థియేటర్ల వద్ద కనిపించారు. ఇక మరికొందరైతే ఈ సినిమాను ఎవర్‌గ్రీన్ డిజాస్టర్ బ్రహ్మోత్సవం పార్ట్-2 అంటూ ఈ సినిమాను అధ:పాతాళానికి నెట్టేశారు. ఏదేమైనా థ్యాంక్యూ సినిమా కోసం ఆసక్తిగా చూసిన అక్కినేని అభిమానుల ఆశలు, ఈ సినిమా రిజల్ట్‌తో ఆవిరైపోయాయి. ఇక ఈ సినిమా టాక్ బయటకు రావడంతో దీన్ని చూసేందుకు కూడా చాలా మంది ధైర్యం చేయడం లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌తో ఇంట్లో కూర్చున్న ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతోందట. అవును మరి.. రొడ్డకొట్టుడు కంటెంట్‌తో వచ్చే సినిమాలను థియేటర్లలో చూసేందుకే ఇష్టపడని ఆడియెన్స్, ఇంట్లో తీరిగ్గా కూర్చుని తమ సమయాన్ని ఇలాంటి సినిమాలకు కేటాయిస్తారా?

ఇకపోతే అసలు మ్యాటర్ ఏమిటంటే.. థ్యాంక్యూ సినిమా థియేట్రికల్ రిలీజ్ తతంగం ఇవాళ పూర్తి కాగానే, ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్స్‌ను లాక్ చేసుకుందట. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను అతి త్వరలోనే ఈ రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రేక్షకులు వీక్షించవచ్చని సదరు ఓటీటీ నిర్వాహకులు తెలిపారు. మరి థ్యాంక్యూ సినిమాను ఓటీటీలో చూసి తరించేవారిలో మీరు కూడా ఉన్నారా..?