నిధి, నభా ఎక్కడ.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

నిధి అగర్వాల్, నభా నటేష్ ఏమైపోయ్యారు అనేది ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే సమయంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు. తన అంద, చందాలతో సినిమాల్లో అలరించారు. తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో మంచి పేరు తచ్చుకుంది. ఆ తర్వాత నటించన మిస్టర్ మజ్ను సినిమా సరిగ్గా ఆడలేదు. అయితే సరే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాలో నిధి అగర్వాల్ అవకాశం కొట్టేసింది.

ఇక నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా నటేష్.. ఆ సినిమాను గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేషన్ హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ సినిమాలో నిధి, నభా నటేష్ కలిసి నటించి స్టార్ డమ్ ను అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో నిధి హీరో అనే సినిమా చూసింది. ఇక ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి ఛాన్స్ కొట్టేసింది.

ఇక నభా నటేష్ విషయానికొస్తే.. వ డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాల్లో వరుసగా నటించింది. ఆ సినిమాలు నభా నటేష్ కు అంతగా కలిసి రాలేదు. ఆ తర్వాత నభా నటేష్ కు అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరు బ్యూటీలు టాలీవుడ్ లో కనిపించడం లేదు. ప్రస్తుతం వేరే భాషల్లో కూడా నిధి, నభా నటేష్ కు అవకాశం లభించడం లేదు.