విడాకుల‌కు అస‌లు కార‌ణం ఇదే.. ఒకే రూమ్‌లో ఉన్నా అంతే.. స‌మంత సంచ‌ల‌నం..!

తెలుగు తెర నటీనటులు సమంత – నాగచైతన్యల ప్రేమ-పెళ్లి-పెటాకులు సంగతి అందరికీ తెలిసినదే. వారు విడయిపోయి 9 నెలలు దాటిపోతున్నా వారిని ఆ విషయం వదిలిపెట్టడంలేదు. ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు ఈ విషయం గురించి వారిద్దరిలో ఎవరోఒక్కరి దగ్గర ప్రశ్నిస్తూనే వున్నారు. దాంతో సామ్, చే విడాకుల విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

తమ మధ్య అస్సలు సఖ్యతే ఉండేది కాదని వెల్లడించింది. ఒకవేళ తమని ఇద్దరినీ ఓ గదిలో పెట్టి అక్కడ పదునైన ఆయుధాలు ఉంచితే ఇక అంతే సంగతిని చెబుతూ నవ్వేసింది. ఈ షోలో భాగంగా కరణ్ జోహార్ “నీ భర్త నుంచి విడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు?” అని అడగ్గా.. “భర్త కాదు మాజీ భర్త” అని సంబోదించమని సలహా ఇచ్చింది. ఇప్పుడు ఇదే మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి కరణ్‌.. క్షమాపణలు చెప్పడం ఇక్కడ కొసమెరుపు.

ఈ నేపథ్యంలో సామ్ మాట్లాడుతూ… “మేము విడిపోయిన సమయంలో నేను తీవ్ర మనోవేదనకు గురయ్యా. అదృష్టవశాత్తు ప్రస్తుతం ఆ బాధ నుంచి బయటపడ్డాను. ఓ రకంగా చెప్పాలంటే మునుపెన్నడూ లేనివిధంగా దృఢంగా తయారయ్యాను. మేమిద్దరం విడిపోయినప్పుడు నాపై నెగెటివ్‌ ప్రచారం జరిగింది. ఆ సమయంలో వాటిపై స్పందించేందుకు నా దగ్గర సమయం, సమాధానాలు కూడా లేవు. సోషల్‌మీడియాలో నాపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న సమయంలో భరణం కింద రూ.250 కోట్లు నేను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది పూర్తిగా అవాస్తవం. ఇక జన్మలో ప్రేమ అనే జోలికి పోను.” అని చాలా ఎమోషనల్ అయ్యింది సమంత.