ఫస్ట్ టైం సినిమా ప్రమోషన్స్ కోసం సమంత ని వాడుకున్న నాగ చైతన్య ..?

టాలీవుడ్ లవబుల్ కపుల్స్ లో ఒకరు నాగచైతన్య-సమంత. ఇది ఒకప్పుడు మాట. ఇప్పుడు వాళ్లు విడిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో ఇప్పటికి క్లారిటీ లేదు. జనాలు నానా రకాలు గా అనుకుంటున్నా..వాళ్ళు మాత్రం విడి విడిగా తమ సినీ ఫ్యూచర్ లో బిజీ గా ఉన్నారు. సమంత జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తుంటే…

నాగచైతన్య మాత్రం..పరిగెడుతూ పాలు తాగడం కన్నా..నిలబడి నీళ్లు త్రాగడం మంచిది..అంటూ..చిన్నగా గానే మంచి మంచి స్టోరీలను చూస్ చేసుకుంటున్నారు. అంతేకాదు, సినిమా సినిమాకి తనలోని నటనా టాలెంట్ ను చూయిస్తూ..అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. తాజా చైతన్య హీరో గా నటిస్తున్న చిత్రం “థ్యాంక్యూ”. మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ నే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు.

కాగా, ఈ సినిమా జూలై 22 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు చిత్ర బృందం. ఈ నేపధ్యంలోనే చైతన్య ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. ధ్యాంక్యూ అన్న పదం నా జీవితంలో ముగ్గురికే చెప్పాలి అనుకుంటున్నా..”అమ్మ, నాన్న, హాష్(సమంత పెట్)..” అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అంతే , దీని పై అక్కినేని హేటర్స్ కావాలనే ఆయనను టార్గెట్ చేస్తూ..ఆఖరికి సమంత పెట్ ని కూడా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నావా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి అక్కినేని ఫ్యాన్స్ గట్టి కౌంటర్లు ఇస్తున్నా..మ్యాటర్ మొత్తం సమంత పెట్ పైకే మళ్ళింది.