అర్రే అర్రే.. నాగార్జునకు ఏమైంది..?

అక్కినేని వారసుడు కింగ్ నాగార్జున..టాలీవుడ్ మన్మధుడు అని అంతా ముద్దుగా పిలిచుకుంటారు. చాలా రొమాంటిక్..టూ కామెడీ.. ఎవ్వరినైనా ఆప్యాయంగా పలకరించే గుణం..నాగార్జున ను అభిమానించేలా చేస్తుంది. నాగేశ్వరరావు కొడుకు గా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టినా.. ఆయన సొంత టాలెంట్ తోనే పైకి ఎదిగాడు అన్నది వాస్తవం. ఎన్నో ఫ్లాప్ లు రుచి చూసి..తన తప్పులను తెలుసుసుకుని..ఫైనల్ గా సక్సెస్ రూట్ లోకి వచ్చారు..ఈ టాలీవుడ్ కింగ్ నాగార్జున.

సినిమా ల పరమగా నాగార్జున ని మనం వేలు ఎత్తి ఒక్క సారి చూపలేం. కానీ, ఆయన జీవితంలో చేసిన ఒక్కే ఒక్క తప్పు ఎప్పుడు ఆయనను నిందిస్తూనే ఉంటుంది. తన మొదటి భార్య కి విడాకులు ఇచ్చి అమల ని పెళ్లి చేసుకోవడం. ఈ విషయం పాతదే అయినా..ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇక ఇప్పుడు కొడుకు కోడలు విడాకుల మ్యాటర్ రీప్లేస్ చేసింది. నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని వేరుగా బ్రతుకుతున్నారు. నాగచైతన్య తోటి పిల్లలు అందరు ఒకరికి ఇద్దరిని వేసి కన్నేసి..భార్య పిల్లలితో సరదాగా గడుపుతున్నారు. ఇక అఖిల్ కూడా సింగిల్ గానే ఉన్నారు. గత కొద్ది రోజుల నుండి వీళ్ల రెండో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నా ..అవి నిజం కాదని రీసెంట్ గా నాగ్ మొహం చూస్తేనే అర్ధమైపోతుంది.

యాంకర్ సుమ నటిస్తున్న చిత్ర జయమ్మ పంచాయతీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి..గెస్ట్ గా వచ్చారు నాగ్. జనరల్ గా నాగ్ మైక్ పట్టుకుంటే మాట్లాడుతూనే ఉంటారు. మంచి విషయాలు చెప్పుతూ,.. టైం తెలియకుండా మాట్లాడుతారు. కానీ, ఇక్కడ పట్టుమంటే ఐదు నిమిషాలు కూడా నాగార్జున మాట్లాడలేదు. అంతేకాదు, అక్కడ సుమ తో తప్పిస్తే మరేవరితో కలవలేదు. పైగా అక్కడకి వచ్చిన వారు నాగార్జున ఫేస్ చూసి..ఏమైంది నాగ్ కి..ఇలా అయిపోయాడు ఏంటి..? అంటూ గుసగుసలాడుతున్నారు. నిజంగానే నాగ్ ఫేస్ డల్ అయిపోయింది. చూడటానికి వాడిపోయిన కొత్తిమీర కట్టలా..ఏదో బాధను మింగుతూ..చెప్పలేక ..సఫర్ అవుతున్నట్లు ఉంది అంటూ జనాలు అంటున్నారు. దీనికి కారణం కొడుకుల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నాగ్ దిగులు పడుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి నాగ్ ఏం చేస్తారో ..?