మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ను ఏప్రిల్ 12న సాయంత్రం 5.49 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
కాగా ఆచార్య ట్రైలర్ను మామూలుగా కాకుండా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ ట్రైలర్ను సోషల్ మీడియాతో పాటు నేరుగా 150కు పైగా థిటయేర్లలో స్క్రీనింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇలా నేరుగా థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఆచార్య చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచవచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక చిరంజీవి, రామ్ చరణ్ల మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకే హైలైట్గా నిలవనుండటం, ఈ సినిమా కథను కొరటాల అల్టిమేట్గా తీర్చిదిద్దడంతో ఆచార్య ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తండగా, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో చూడాలి.