కొంప ముంచిన కొరటాల..మెగా అభిమానులకు బిగ్ షాక్..!

వచ్చేసింది.. కోట్లాది మంది మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళ్లతో వేచి చూసిన ఆ తరుణం రానే వచ్చేసింది. చాలా రోజుల గ్యాప్ తరువాత వెండి తెర ను షేక్ చేయడానికి రాబోతున్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. యస్.. డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి ఆచార్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మహమ్మారి కరోనా కారణంగా కొన్నిసార్లు..చి రంజీవీ హెల్త్ కారణంగా కొన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకి సిద్ధం అయ్యింది.

సమ్మర్ కానుక గా ఈ సినిమాను ఏప్రిల్ 29న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకుని ఉన్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం ఓ ప్లస్ పాయింట్ అయితే..మెగా అభిమానుల కోరిక ను నిజం చేస్తూ తండ్రి కొడుకులు చిరంజీవి-చరణ్ ఒక్కే ఫ్రేమ్ లో నటించడం మెగా ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో..చిత్ర బృందం ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసింది.

యస్,,కొద్ది సేపటి క్రితమే ఆచార్య ట్రైలర్ ను ఏప్రిల్ 12 న రిలీజ్ చేయబోతున్నామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సో..మరి కొద్ది రోజుల్లోనే మెగా అభిమానులు పండగ చేసుకునే రోజు రాబోతుందనమాట. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి అదిరిపోయే లుక్‌తో మనల్ని కనువిందు చేయనున్నాడు. ముఖ్యంగా చిరు చెప్పే డైలాగ్స్ బాగా హైలెట్ గా ఉన్నాయి. ఈ సినిమాలో పూజా ని మనం కొత్త కోణం లో చూడబోతున్నాం అని పోస్టర్స్ లో చూస్తుంటేనే అర్ధమైపోతుంది. చరణ్ అమాయకత్వం ఈ సినిమా కి మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఓవర్ ఆల్ గా మంచి ఆకలి మీద ఉన్న మెగా అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది అని అర్ధమౌతుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫిస్ షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకి మెయిన్ హైలెట్ చిరంజీవి – చరణ్ తెరపై కలిసి కనిపించే ఆ 20 నిమిషాలే అని.. ఆ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.