నువ్వు నా పక్కనే..టచ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాటలు..!!

చాలా మందికి స్టేజీ పై మాట్లాడాలి అంటే ఏదో తెలియని భయం ఉంటుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే..లోలోపల ఒక భయం మనల్ని మాట్లాడనీకుండా ఆపేస్తుంది. మన తెలుగు హీరోలు కూడా చాలా మంది తెర పై నటిస్తారే కానీ..స్టేజీ ఎక్కి మాట్లాడమంటే..కొంచెం వెనకడుగు వేస్తారు. అంత బాగా మాట్లాడలేరు. అలా ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడే హీరో మన ఇండస్ట్రీలో చాలా తక్కువ. అలాంటి వారి లో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు టాప్ లోనే ఉంటారు.

ఆ విషయంలో తాత తగ్గ మనవడిగా స్టేజీ పై స్పీచ్ అదరకొట్టేస్తారు. తన మాటలతో అభిమానులను ఉత్సాహ పరుస్తూనే.. మంచి మాటలు చెప్పే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. నిన్న బెంగుళురు లో ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. లక్షల మంది అభిమానులు ..బడా స్టార్స్ మధ్య అంగరంగ విభవంగా జరిగింది. కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‏లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ కార్యక్రమానికి సీఎం బసవరాజ బొమ్మై చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఇక ఈ సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. వేదిక పై ఆయన మాట్లాడుతూ..”కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను స్మరించుకున్నారు. మనమధ్య పునీత్ సార్ లేరని బాధపడకండి..ఆయన ఎక్కడకి వెళ్లలేదు.. గాలి ,నీరు రూపంలో మన మధ్య ఉన్నారు. చూడండి ఇప్పుడు కూడా నేను మీ దగ్గరే ఉన్నాను అంటూ వర్షం రూపంలో మమల్ని ఆశీర్వదిస్తున్నారు. నేను మీ ఈవెంట్ కి వచ్చాను అంటూ చల్లటి గాలి రూపంలో మనల్ని తాకుతున్నారు. నేను నమ్ముతున్నా పునీత్ సార్ ఇక్కడే ఉన్నారు అని..మీరు నమ్మండి..ఆయన మనతోనే ఉన్నారు. ఎల్లప్పుడు మనతోనే ఉంటారు”..అంటూ స్టేజీ పై ఎన్టీఆర్ మాట్లాడిన తీరు అభిమానులను కట్టిపడేసింది. ఇక స్టేజీ పై ఆయన మాట్లాడుతున్నంత సేపు అభిమానులు “జై ఎన్టీఆర్..జై ఎన్టీఆర్..జై ఎన్టీఆర్” అంటూ అరుస్తూనే ఉన్నారు.