‘ఆర్ఆర్ఆర్-2’ కూడా ఉంది..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసిన జక్కన్న..!!

దాదాపు నాలుగేళ్లు పగలు రాత్రి తేడా తెలియకుండా..ఎందరో టెక్నీషియన్స్ తో..ఎన్నో కోట్లు ఖర్చు చేసి..ప్రతి సెకండ్ కష్ట్పడుతూ..కరోనాని సైతం లెక్క చేయకుండా..విదేశాలల్లో షూటింగ్ చేసి రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR. మరి కొన్ని రోజులో ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మన ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ గా కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర్‌ లో జరిగింది. కార్యక్రమానికి చిఫ్ గెస్ట్ గా హాజరైన బసవరాజ్ బొమ్మై.. రాజమౌళి కి..RRR చిత్ర బృందానికి ..కంగ్రాట్స్ తెలుపుతూ..సినిమా హిట్ అవుతుందని ముందే అడ్వాన్స్ విషెస్ చెప్పుకొచ్చారు.

ఇక వేదిక పై ఎన్టీఆర్ మాట్లాడుతూ..” కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని స్మరించుకున్నారు. తనకు కర్ణాటకతో ఉన్న సంబంధం గురించి చెప్పుతూ..మా అమ్మకు నేను కన్నడ లో మాట్లాడితే చూడాలని కోరిక అంటూ చెప్పుకొచ్చాడు. తనదైన స్టైలో కన్నడ లో మాట్లాడి అభిమానులను మెప్పించాడు. ప్రాంతీయ సినిమాల భేదాలు లేకుండా..అలాంటి అడ్డంకులను చెరిపివేసిన రాజమౌళి.. తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ చెప్పుకొచ్చాదు. ఇది భారతదేశ సినిమా అని..ఈ సినిమాలో నేను ఓ భాగమైనందుకు చాలా చాలా గర్వంగా ఉంది”అన్నారు.

ఇక ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.” మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరిని పొగిడేశారు. ఇద్దరు హీరోలు కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం లాంటిదని రాజమౌళి తనదైన స్టైల్లో అభివర్ణించాడు. అంతేకాదు మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ గురించి కూడా స్టేజీ పై మాట్లాడారు. మెగా అభిమానులను బంగాళాఖాతంతోను..అలాగే నందమూరి అభిమానులను అరేబియా మహాసముద్రంతో పోలుస్తూ..తన మాటలతో అభిమానులను ఉత్సాహ పరిచాడు జక్కన్న. చరణ్-తారక్ ల మధ్య ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అని రాజమౌళి వేదిక పైనే చెప్పుకొచ్చాడు. కాగా స్పీచ్ అంతా అయిపోయాక ఫైనల్ టచ్ ఇస్తూ..త్వరలోనే మరో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తో మీ ముందుకు వస్తాను అని చెప్పిన అయినా షాకింగ్ ట్వీస్ట్ ఇస్తూ..చరణ్-తారక్ ల ఆర్ ఆర్ ఆర్ సినిమా కంటే ముందే ఈ సినిమా విడుదల చేస్తాం అన్నారు, కానీ ఈ RRRలో హీరోల కంటే ముందే అసిస్టెంట్ డైరెక్టర్లు నటించి చూపిస్తారన్నారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’కు మించిన కామెడీ సినిమా ఉండదు..అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు .