తూచ్..RRR ప్రీ రిలీజ్ గెస్ట్ మారిపోయారోచ్..రంగంలోకి బాలయ్య చిరు..?

RRR..ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అంతలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు రాజమౌళి. సినిమాలో తెరకెక్కించడంలోనే కాదు..ఆ సినిమాలని ప్రమోట్ చేయడంలోను రాజమౌళి ధిట్టా. అయితే ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా కే ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల ప్రజలను కవర్ చేస్తూ..సినిమాకి మంచి హైప్ తీసోస్తున్నారు.

ఎప్పుడో రిలీజ్ అవ్వాలసిన ఈ సినిమా మర్చీ 25 వ తేదీన రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిధమైంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం హడావుడిగా ప్రమోషన్స్ పనులు కంప్లీట్ చేస్తుంది. ఈ క్రమంలోనే RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ మరొ కొద్ది గంటల్లో బెంగుళూరు లో మొదలు కానుంది.

కర్ణాటకలోని చిక్కబల్లాపురలో సాయంత్రం 6 గంటలకు RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటి వరకు ఎక్కడ జరగని ఎవ్వరు ఊహించని విధంగా బిగ్గెస్ట్ ఈవెంట్ గా RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కాగా, ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మొదట.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మే, హెల్త్ మినిస్టర్, అలాగే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని వార్తలు వినిపించాయి. అయితే లాస్ట్ మినిట్ లో ప్లాన్ మారుస్తూ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్లుగా టాలీవుడ్ బడా హీరోలు మెగాస్టార్ చిరంజీవి..నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ఒక్కవేళ ఇదే నిజం అయితే.. అభిమానులకు ఇంతకన్నా పెద్ద పండగ మరోకటి ఉండదు అనే చెప్పాలి. రామ్ చ‌ర‌ణ్ రామ‌రాజు పాత్ర‌లో న‌టించ‌గా.. ఎన్టీఆర్ భీమ్ పాత్ర‌ల్లో మెరిశారు. జ‌క్క‌న్న మాయా ప్ర‌పంచాన్ని చూసేందుకు ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా ఎద‌రు చూస్తోంది.