మరికొన్ని గంటల్లో RRR రిలీజ్..ధియేటర్ ఓనర్స్ సంచలన నిర్ణయం..?

ప్రపంచ వ్యాప్తంగా మరొ కొద్ది గంటల్లోనే RRR సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీని కోసం జక్కన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవ్వరికి వాళ్లు తమ ఫ్యామిలీతో సినిమా ను చూడటానికి రెడీ అవుతున్నారు. బడా బడా స్టార్స్ కూడా..ఈ సినిమాను తెర పై చూడటాని ఈగర్ వెయిట్ చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దాదాపు నాలుగేళ్ళు కష్టపడి తెరకెక్కించిన ఈ మూవీని అసలు రిజల్స్ మరి కొద్ది గంటల్లోనే తేలిపోతుంది.

కాగా, ఈ సినిమా రిలీజ్ అవుతున్న ధియేటర్స్ ఓనర్స్ ముందుకు జాగ్రత్త గా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ధియేటర్స్ వద్ద ఎటువంటి గొడవ్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా RRR రీలిజ్ అవుతున్న ధియేటర్స్ స్క్రీన్ల దగ్గర ఫెన్సింగ్, మేకులతో జాగ్రత్తలు చేసారు. ఇద్దరు బడా హీరోస్ అందులోను మెగాస్టార్ కొడుకు చరణ్..మరోకరు లెజండ్ హీరో మనవడు తారక్..ఇక ఫ్యాన్స్ రచ్చ గురించి చెప్పాలా చెప్పండి..బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే.

బాక్స్ ఆఫిస్ వద్ద బొమ్మ సంగతి ఎలా ఉన్నా..ఫ్యాన్స్ దెబ్బకు తమ ధియేటర్స్, స్క్రీన్లు దెబ్బతినకుండా ఉండాలని ఏపీలో ని శ్రీకాకులం లో కొన్ని ధియేటర్స్ ఓనర్స్ ఫ్యాన్స్ నుండి తమ ధియేటర్స్ ని రక్షించుకోవడానికి స్క్రీన్ల పైకి పోకుండా ఫ్యాన్స్ ని ఆపడనికి చుట్టు ముళ్ల కంచెను పెట్టారు. మరి కొన్ని ధియేటర్ ఓనర్స్ మేకులు సెట్ చేశారు. ఇలా మెగా, నందమూరి ఫ్యాన్స్ నుండి తమ ధియేటర్స్ కాపాడుకొవదానికి ధియేటర్ ఓనర్స్ నానాతిప్పలు పడుతున్నారు. కాగా, మరి కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుండటంతో..ధియేటర్స్ వద్ద అభిమానుల సందడి మామూలుగా లేదు.. తీన్ మార్ స్టెప్పులతో..పూల దండలతో “జై ఎన్టీఆర్” అంటూ ఒకరు అంటుంటే..”జై చరణ్” అని మరోకరు పోటీపడీ అరుస్తూ..మిగతా అభిమానులకు ఊపు తెప్పిస్తున్నారు. టోటల్ గా ఓ పండగ వాతావరణం నెలకోంది.