వంగవీటి రాధపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ లో వైస్ జగన్ సర్కార్ కొత్త జిల్లాల ప్రకటన చేసిన తరువాత రాష్ట్రంలో అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే .రాజంపేట ప్రధాన కేంద్రంగా అన్నయ్య జిల్లాగా ,హిందూపూర్ ప్రధాన కేద్రంగా సత్యసాయి జిల్లాలకు పెద్ద ఎత్తున్న ఆందోళను జరుగుతున్నాయి .అలాగే వంగవీటి రంగ జిల్లా ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున అభిమానులు ,కాపు నాయకులు పోరాడుతున్నారు .

అయితే తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రంగ జిల్లా ఏర్పాటుపై వంగవీటి రాధా పై సంచల వ్యాఖ్యలు చేశారు .అయన ఏమన్నారో అయన మాటలోనే చూద్దాం . ‘‘మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధాకు మంచి సంబంధాలు ఉన్నాయి. డిసెంబరు 26న వాళ్లంతా కలిసి కార్యక్రమాలు చేశారు. నాని, వంశీలు ఉద్యమం చేయనక్కర్లేదు… వాళ్ల నాయకుడికి ఒక్క మాట చెబితే చాలు. రాధా ఆవైపు ప్రయత్నం చేస్తున్నారేమో నేను చెప్పలేను. రేపు నేను చేపట్టే దీక్షకు కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ తరలి రావాలి. మీడియా ద్వారా అందరికీ ఇదే నా ఆహ్వానం. రంగా అభిమానులు అందరూ దీక్షలో పాల్గొనాలి’’ అంటూ బోండా ఉమా పిలుపునిచ్చారు. దీనిపై రంగ కుమారుడు రాధా ఎలా స్పందిస్తారో చూడాలి .